మహిళల సంక్షేమమే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి లక్ష్యం అని రాష్ట్ర మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు అన్నారు భీమిలి మండలం తాటితూరు పంచాయతీ లో ఏర్పాటు చేసిన నవరాత్నాలు లో బాగంగా ప్రవేశపెట్టిన జగనన్న చేయూత కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు లా మాటలు కు పరిమితం కాకుండా జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్ర లో ఇచ్చిన మాటకు మడం తిప్పకుండా సంక్షేమ పథకాలు నేరుగా అందించే చేతల ముఖ్యమంత్రి అని,ప్రజలకు మంచి పాలన అందించాలంటే పెద్ద వయసు పెద్ద అనుభవం ఉంటె సరిపోదు జగన్ మోహన్ రెడ్డి గారిలా పెద్ద మనసు ఉండాలని దేశంలో మహిళలకు సుమచిత స్థానం కల్పించిన ఏకైక జగన్ మోహన్ రెడ్డి కే దక్కింది అని మహిళలు అంతా ఆయన వెంటే ఉన్నారని మాట్లాడారు. అనంతరం మహిళలు అంతా కలిసి జగనన్న చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం అవంతి శ్రీనివాసరావు గారి చేతులు మీదుగా 3,733 మంది లబ్దిదారులకు 6కోట్ల 99 లక్షల రూ చెక్కును అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మూడు మండలాల యంపిపి లు జెడ్పిటీసి లు వైస్ యంపిపి లు ,సర్పంచ్ లు యంపిటిసి లు,ఆయా పదవుల్లో ఉన్న వారు నాయకులు ప్రభుత్వ అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు.