భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం లో విశాఖ జిల్లా వైసిపి పార్టీ అధ్యక్షులు భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు గౌ.ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు పాల్గోవడం జరిగింది.సమావేశం లో బాగంగా ఆయన మొదటిగా మండలం లో అన్ని గ్రామాల్లో ఉన్న సమస్యలపై అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించి ఏమైనా అసంపూర్తిగా ఉన్న పనులు ఉంటే వాటిని పూర్తి చేయాలని ముఖ్యంగా మండలం లో విద్యుత్ సరఫరా కి సంబందించిన సమస్యలు ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు….!అనంతరం అవంతి శ్రీనివాసరావు గారి ని మండలం నాయకులు గౌరవ ప్రదంగా సన్మానించడం జరిగింది…ఈ కార్యక్రమంలో మండల అధికారులతో పాటు మండల ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.