మండలంలో నూతనంగా ఎన్నికైన మండల ప్రజా పరిషత్ పాలకవర్గం మొదటి సర్వసభ్య సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ.. గ్రామాల్లో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్ సమస్యలు లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మండలంలోని 16 గ్రామాల్లోని సచివలయాలు, సిబ్బంది, వలంటీర్లతో ప్రతినెలా రివ్యూ మీటింగ్ నిర్వహించాలని అన్నారు. సర్పంచులు గ్రామాల్లోని సమస్యలను ఎంపీపీ దృష్టికి పెద్ద సమస్యలైతే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని అన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో పెంచల కిషోర్, ఎండీఓ చిట్టిరాజు, జడ్పీటీసీ సుంకర గిరిబాబు, ఎంపీపీ కంటుబోతు రాంబాబు, వైస్ ఎంపీపీ కోరాడ మంజు లక్ష్మణరావు, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.