ఈరోజు అనగా తేది 12-08-2022 శుక్రవారం నాడు జీవియంసి 5వ వార్డు వివేకానంద నగర్ 1 లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో స్థానిక యంయల్ఏ అవంతి శ్రీనివాసరావు గారికి ప్రజలు సాదర స్వాగతం పలికారు.అనంతరం 5వ వార్డు లో సద్గురు సాయి నాథ్ కోలనీ – గాంధీ నగర్ – ముత్యాలమ్మ కోలనీ లో 320 ఇంటింటి కి తిరిగి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగగా జగన్మోహన్ రెడ్డి గారు అందించే పథకాలు అన్నీ సక్రమంగా అందుతున్నాయని ప్రతీ ఒక్కరు సంతోషం తో చెప్పడం జరిగింది.అనంతరం ఆయన సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ప్రజలను అడగగా1) గాంధీ నగర్ లో రెండు చోట్ల సిసి రోడ్డు వేయాలని2)ముత్యాలమ్మ కోలనీ లో 7 విద్యుత్ స్తంభాలు వేయాలని3) వీధి లైట్లు – డ్రైనేజీ వ్యవస్థ నిర్మించాలని 4)సద్గురు సాయి నాథ్ కోలనీ లో 450 ఇళ్ళు కి త్రాగునీటి సౌకర్యార్థం ఇంటింటికి కుళాయిలు వేయాలని5) సం తరబడి నివసిస్తున్న ఇళ్ళు కు పట్టాలు ఇప్పించాలని6) పలు కారణాల చేత అందని సంక్షేమ పథకాలు సమస్య పరిష్కారం చేసి అందించాలనిసమస్యలు విన్న అవంతి శ్రీనివాసరావు గారు వెంటనే స్పందించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు ఈ కార్యక్రమంలో వార్డు కార్పోరేటర్ లు – ఇంచార్జ్ లు – ఆయా ఆయా పదవుల్లో ఉన్న వారు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.