విశాఖలో కైలాసగిరి పక్కన సముద్రపు ఒడ్డున నిలచిపోయి ఉన్న బాంగ్లాదేశ్ కు చెందిన “ఎంవీ మా” నౌకను ఫ్లోటింగ్ రెస్టారెంట్ రూపంలో మార్చి మరో అద్భుత పర్యాటక ప్రదేశంగా రూపొందిస్తున్నట్లు తెలిపారు. గురువారం తెన్నేటి పార్క్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 2020 అక్టోబర్ లో తుఫాను తాకిడికివిశాఖ తీరానికి వచ్చిన బాంగ్లాదేశ్ నౌకను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని అన్నారు.