తేది అనగా 23-8-2022 మంగళవారం నాడు పద్మనాభం మండలం శేరిఖండం పంచాయతీ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో స్థానిక యంయల్ఏ అవంతి శ్రీనువాసరావు గారు పాల్గొనడం జరిగిందిఆనంతరం ఆయన శేరిఖండం – అంబేద్కర్ కోలనీ – పరదేశి వారి కల్లాలు – రెడ్డిపల్లి వారి కల్లాలు – సంగుపేట 249 ఇళ్ళు ఇంటింటి కి తిరిగి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగగా జగన్మోహన్ రెడ్డి గారు అందించే పథకాలు అన్నీ సక్రమంగా అందుతున్నాయని ప్రతీ ఒక్కరు సంతోషం తో చెప్పడం జరిగిందిసమస్యలు ఏమైనా ఉన్నాయా అని ప్రజలను అడగగా
1) అంబేద్కర్ కోలనీ వాసులకు రచ్చబండ కావాలని
2) స్మశానం కి వెళ్ళడానికి సరైన మార్గం లేదు దారి కావాలని
3) సంగుపేట లో డ్రైనేజీ వ్యవస్థ నిర్మించాలని
సమస్యలు విన్న అవంతి శ్రీనివాసరావు గారు వెంటనే స్పందించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో మూడు మండలాల యంపిపి లు – జెడ్పిటిసి లు – వైస్ యంపిపి లు – సర్పంఛ్ లు – యంపిటిసి లు – ఆయా ఆయా పదవుల్లో ఉన్న వారు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు