కమ్యూనిటీ హాల్ శంఖుస్థాపన భీమునిపట్నం, ఆగస్ట్ 06, విశాఖటుడే భీమునిపట్నం, కృష్ణా కొలనీ సమీపంలో కస్తూరిభా స్కూల్ ఎదురుగా GVMC మరియు సి.యస్.ఆర్ వారి యొక్క సుమారు ఏడుకోట్ల రూపాయల నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని హంగులతో , అధునాతన వసతులతో భీమిలీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. ఈ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి అందరికి అందుబాటులోకి తీసుకు రావల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నదని అందులో భాగంగానే ఈ రోజు భీమిలీ ప్రజలకు అన్ని ఆధునిక వసతులతో కూడిన ఈ కమ్యూనిటీ హాల్ ఏడు కోట్ల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు ,వై.సిపి నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *